వీరబాబు కుటుంబానికి అండగా నిలచిన జనసేన

  • వీరబాబు కుటుంబాన్ని పరామర్శించిన మర్రెడ్డి శ్రీనివాసరావు

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, పందలపాక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కడియల వీరబాబు మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మంగళవారం వీరబాబు కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ పరిస్థితిని చూసి 5000 రూపాయలు, మండల జనసైనికులు సమకూర్చిన పదివేల రూపాయలు మొత్తం 15 వేల రూపాయలు వారి కుటుంబానికి అందించడం జరిగింది. జనసేన పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిక్కవోలు, అనపర్తి మండలాల అధ్యక్షులు ఇందల వీరబాబు, ఎన్.ఆర్.కె ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోరాడ రామారావు, మండల కమిటీ సభ్యులు కర్రీ శ్రీను, పందలపాక గ్రామ శాఖ అధ్యక్షులు సిమ్మ మణికంఠ, శెట్టిబలిజ సంఘ పెద్ద పుట్ట రాజు, నాని, సిమ్మ నూకరాజు, సిమ్మ సోదరులు, జనసైనికులు పాల్గొన్నారు.