తొలి టీ 20లో.. భారత్ బోణీ

కాన్‌బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆసిస్‌పై 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బౌలర్ల విజృంభణతో ఆసిస్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ విజయం సునాయాసమైంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ.. రాహుల్ 51 పరుగుల తేడాతో రాణించాడు.చివర్లో జడేజా చెలరేగి 23 బంతుల్లో 44 పరుగులు చేసి, ఆదుకోడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది.

అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఓపెనర్లు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం ఇచ్చినా, ఆ తరవాత భారత బౌలర్లు కట్టుదిట్టమౌన బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. ముఖ్యంగా తొలి టీ20 ఆడుతున్న నటరాజన్ 30 పరుగులకు 3 వికెట్లు తీసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చాహల్ కి మూడు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జడేజా గాయపడడంతో. అతని స్థానంలో కండీషన్ సబ్‌స్ట్యూట్‌గా చాహల్ బౌలింగ్ కి దిగాడు. రెండో టీ 20 ఆదివారం జరగనుంది.