పురపాలక సమావేశంలో.. జనసేన కౌన్సిలర్ లు

అమలాపురం పురపాలకసాధారణ సమావేశం శనివారం చైర్ పర్సన్ రెడ్డి సత్యనాగేంద్ర మణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. ప్రతి పక్ష నేత, జనసేన 3వార్డ్ కౌన్సిలర్ యేడిద వెంకటసుబ్రహ్మణ్యం (శ్రీను) మాట్లాడుతూ వైస్ చైర్ పర్సన్ తిక్కిరెడ్డి వెంకటేష్ 8వ వార్డులో డ్రైనేజ్ నిర్మాణం చేపట్టక పోవడం వలన 4వార్డులు ముంపుకు గురి అవుతున్నా పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏడాది క్రితం టెండర్ వేసినా, ఇప్పటికీ పని పూర్తి కాలేదని ప్రశ్నించారు. పట్టణంలో 40లక్షలు వ్యయంతో ఏర్పాటు చేసే మొక్కలు వివరాలు ఏమిటీ అని అధికారులను అడిగారు. జనసేన 21వార్డ్ కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి మాట్లాడుతూ డ్రైన్ లకు అవుట్ లెట్ లేక మురుగు నీరు వెళ్ళక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో జనసేన కౌన్సిలర్ పిండి అమరావతి, పడాల శ్రీదేవి, గండి దేవి హారిక, గొలకోటి విజయలక్ష్మి పాల్గొన్నారు.