పవన్ వారాహి యాత్ర పేరిట ప్రత్తిపాడు జనసేన ప్రత్యేక పూజలు

  • వారాహి యాత్రకు సంఘీభావంగా ప్రత్తి బావన్నారాయణ ఆధ్వర్యంలో ముట్లూరులోని సాయి బాబా మరియు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు

ప్రత్తిపాడు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ముట్లూరులో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రత్తి బావన్నారాయణ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తి బావన్నారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు శుభసూచికంగా ఉండాలని, ప్రతి ఒక్కరి మద్దతు వారాహి యాత్రకు ఉండాలని, వారాహి యాత్ర విజయవంతంగా సాగాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కోటికం వెంకటేశ్వరరావు, ఎనిమిదో వార్డ్ మెంబర్ బీరాల శ్రీనివాసరావు, ఉపేంద్ర, నామ శ్రీనివాసరావు, బాజీ, పోతంశెట్టి శంకరు, సాయి సర్దార్, నరేష్, కిషోర్, బాల సాయి, వెంకటేశ్వరరావు, గోపి, మణికంఠ, వట్టి చెరుకూరు మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.