పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం నుండి మరియు భావన్నారాయణ పురం నుండి అధికార వైసిపి పార్టీ నుండి 200 మంది పెద్దలు, మహిళలు, యువత స్థానిక జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో భారీగా చేరారు. వారందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికి అభినందనలు తెలిపారు. పార్టీలో చేరిన వారు, వైసిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన భావన్నారయణ స్వామి దేవాలయం మాజీ చైర్మన్లు పుల్ల శ్రీరాములు, (చైర్మన్ శ్రీను) పుల్ల శేషుకుమారి, మాజీ ఎంపిటిసి దళిత నాయకుడు బొండాడ చంటబ్బాయి, వార్డుమెంబర్లు, పుల్ల వెంకటశేషరావు, పుల్ల సత్యవతి, మాజీ భావన్నారయణ స్వామి దేవాలయం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ పుల్ల సత్తిబాబు, వైసిపి బూత్ కమిటీ మాజీ అధ్యక్షులు బిసి నాయకులు పిట్టా రాంబాబు, మాజీ వార్ఢు మెంబర్ దినవాహిా వెంకటరాజు, మాజీ వార్ఢు మెంబర్ డ్వాక్రా సంఘం అధ్యక్షరాలు యర్రంశెట్టి నీలవేణి, యర్రంశెట్టి రాజేశ్వరి, పెద్దఎత్తున యువత ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, మండల స్థాయి, గ్రామ కమిటీ అధ్యక్షులు, జనసైనికులు, స్థానికులు పాల్గొన్నారు.