కొత్తకోటలో 55 అడుగుల జనసేన జెండా ఆవిష్కరణ

చిత్తూరు, కొత్తకోటలో గుడిపాల మండల ఉపాధ్యక్షుడు రూప్ కుమార్ ఆధ్వర్యంలో 55 అడుగుల జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, ఐటీ వింగ్ విభాగం సభ్యులు వుయ్యాల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్, చంద్రగిరి జనసేన నాయకులు దేవర మనోహర్, జి.డి.నేల్లూరు జనసేన పార్టీ ఇంచార్జ్ యుగంధర్ పొన్న, యశ్వంత్, బాటసారి, జిల్లా ఐటీ వింగ్ విభాగం సభ్యులు పృధ్వీ రాయల్, జనసేన నాయకులు శ్రీమతి రమాదేవి, మండల కమిటీ సభ్యులు, వీర మహిళలు జనసేన నాయకులు, కొత్తకోట జనసైనికులు జగదీష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.