పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో ఘనంగా మహిళలకు ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభోత్సవం

అనంతపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయసాధన కోసం రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు మహిళా సాధికారత వారి ఆర్థిక అభివృద్ధి, స్వయంఉపాధి ఆర్థిక చేయూతలో భాగంగా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ, ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, డిజైన్ పెయింటింగ్ వర్క్ వంటి శిక్షణ తరగతులను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేన పార్టీ నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అందులో భాగంగా ఈరోజు మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించి వారి ఆర్థిక అభివృద్ధి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, అనంతపురం జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, నగర ప్రధాన కార్యదర్శులు పెండ్యాల చక్రపాణి, రొల్ల భాస్కర్, కాశెట్టి సావిత్రి, నగర కార్యదర్శి జక్కిరెడ్డి పద్మావతి, నాయకులు కొండిసెట్టీ ప్రవీణ్ కుమార్, గురు ప్రసాద్, బండి శేఖర్, సాయి కుమార్ వీర మహిళలు శ్రీదేవి, గుమ్మడిసాని శిల్పా, బండి సంధ్య, సుబ్బమ్మ, అనంతమ్మ, వరలక్ష్మి, సరస్వతమ్మ, శిక్షణ పొందు మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.