జనసేన మండల పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెంలో జరిగిన మండల పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ చేతుల మీదగా పార్టీ ఆఫీసు ప్రారంభించి జెండా దిమ్మను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన ఇతర ముఖ్య నేతలు, నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.