అశ్వరావుపేట జనసేన పార్టీ ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ డేగల రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గడప గడపకు జనసేన పార్టీనీ విస్తృత స్థాయిలో బలోపేతం చేసి రానున్న రోజుల్లో పార్టీని పూర్తిస్థాయిలో జనాల్లోకి తీసుకువెళ్ళడమే ఈ పోస్టర్ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామస్థాయి నుండి జనాల్లోకి గాజు గ్లాస్ గర్తును తీసుకు వెళ్ళడమే జనసేన పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విస్లావత్ వినోద్, బద్దిరెడ్డి రాజేష్, లింగిశెట్టి కుమార్ స్వామి, దామెర బాబి, రాజా, నాగు, మల్లం రామకృష్ణ, మంగా, రవీంద్ర, ఉప్పల మల్లికార్జున, మల్లికార్జున రావు, నందం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.