చల్లపల్లిలో జనసేన పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవం

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, చల్లపల్లిలో ఆదివారం జనసేన పార్టీ మండల కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయాన్ని కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రాము చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఇంచార్జ్ బండి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు, ఆరు మండలాల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.