శేరిలింగంపల్లిలో జాయిన్ విత్ జే.ఎస్.పి పోస్టర్ ఆవిష్కరణ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జాయిన్ విత్ జే.ఎస్.పి అనే కార్యక్రమం ద్వారా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. డా.మాధవ రెడ్డి అధ్వర్యంలో సుమారు పదిహేను మంది జనసైనికులను పార్టీకిలోకి ఆహ్వానించడం జరిగింది. శేరిలింగంపల్లిలో జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు, ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్న విధానం నచ్చి స్వచ్ఛందంగా జనసేన పార్టీ విధి విధానాలు, ఆశయాలు తెలుసుకొని జనసేనలో చేరారు. వారి మాటల్లో జనానికి జరుగుతున్న అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసం చేస్తున్న విన్యాసాలు వేరే రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాలు వారి మాటల్లో స్పష్టత దేశం కోసం ఆలోచించే శక్తి సామర్ధ్యాలు స్పష్టంగా ప్రభుత్వాలు చేస్తున్న అవినీతికి వ్యతిరేకత ఎంతవుంది అనేది తెలుస్తుంది. ఇందుకోసం నాతో పాటు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు చేస్తున్న కృషి ఫలితం ఈ స్వచ్ఛందంగా పార్టీలో చేరికలు నాకు ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది. మన శేరిలింగంపల్లిలో జనసేన బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రజల సమస్యలపై నిరంతరం పని చేయాలి అని సూచించారు. ఇదేవిధంగా చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యువతకు సూచించారు. పార్టీలో జాయిన్ అయిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అశోక్, శ్రవణ్ కుమార్, సందీప్, కాసెట్టి, సాయి కార్తిక్, సాయి సతీష్, చర్వకుడు, ప్రశాంత్, నర్సింహ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.