పెరిగిన బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలి: మాదాల శ్రీరాములు

అల్లూరిసీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, అరకువేలి.. రాష్ట్ర ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచి ప్రజల మీద మరింత భారం మోపింది. ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఇస్తున్న బహుమతులు.. మొదట ఇంటి పన్ను చెల్లించండి అన్నారు. తరువాత పెట్రోల్, డీజిల్, మంచినూనే, నిత్యావసర సరుకులు రేట్లు పెంచారు. అయినా రాష్ట్ర ప్రజలు భరించారు. నేడు బస్సు ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపుతున్నారు. సామాన్య ప్రజలను రాష్టంలో భతకనివ్వరా.. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న ప్రజానీకానికి తోడు పన్నుల పేరుతో దోచుకుంటున్న ప్రభుత్వం రోజు కో రేటు, మాటకో రేటు, పూటకో రేటు.. ప్రభుత్వ తీరుతో ప్రజలు ఆందోళన చెందున్నారు. ఓట్లు వేసిన పాపనికి ప్రజలకు మీరిచ్చే బహుమతి ఇదేనా అంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా నేడు మాట్లాడుకుంటున్నారు. అయినా ప్రభుత్వ తీరు మారటం లేదు. ప్రభుత్వ ఆలోచన తీరు మరకపోతే వైస్సార్ పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయం. విద్యుత్ చార్జీలు పెంచినా.. బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. లేని పక్షాన జనసేనపార్టీ అద్వర్యంలో ర్యాలీలు.. నిరసన కార్యక్రమాలు చేపడతాం. ప్రభుత్వ తీరు మారేవరకూ.. పెంచిన చార్జీలు తగ్గించేవరకు జనసేనపార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని మాదాల శ్రీరాములు తెలిపారు.