జనసేన పరిచయ వేదిక

పాయకరావుపేట: జనసేన పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి సూచన మేరకు కోటవురట్ల మండలం, వెంకటాపురంలో గురువారం “జనసేన పరిచయ వేదిక” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసైనికులకు, వీరమహిళలకు జనసేన పార్టీ కార్యాచరణపై దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. కార్యక్రమంలో వెంకటాపురం గ్రామం జనసైనికులు, వీరమహిళలతో జనసేన పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి తదితరులు పాల్గొన్నారు.