పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి

  • జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి
  • భగత్ సింగ్ కాలనీలో జనం కోసం జనసేన కార్యక్రమం

నెల్లూరు: రాష్ట్రంలో ప్రజల నుంచి రకరకాల పేర్లతో విద్యుత్ చార్జీల భారాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం మోపుతుందని, పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గి శెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఆయన జన సైనికులతో కలిసి వెంకటేశ్వర పురం, భగత్ సింగ్ కాలనీల్లో పర్యటించారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రాబోయేది జనసేన ప్రభుత్వం అని, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించాలని అన్నారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ .. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేవలం తమ స్వార్థం కోసం ఉచిత హామీల రూపంలో అధిక మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ తప్పులు కప్పి పుచ్చుకునేందుకు అడ్డదారిలో ఖజానాను నింపుకునేందుకు ప్రస్తుతం విద్యుత్ చార్జీలను పెంచిందని విమర్శించారు. ఇప్పటికే విద్యుత్ చార్జీల మోతతో సతమతమవుతున్న ప్రజలు .. తాజాగా పెరిగిన విద్యుత్ చార్జీలతో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటేశ్వర్లు, అలెక్, కంతర, ప్రతాప్, సాయి, ప్రవీణ్, మని తదితరులు పాల్గొన్నారు.