వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది: నేమూరి శంకర్ గౌడ్

వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర జనసేన ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం శనివారం ఆయన పత్రికా ముఖంగా మాట్లాడుతూ.. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా ఆయనను గన్నవరం విమానాశ్రయంలో అడుగు పెట్టకుండా ఆపాలని పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఖూనీ చేసినట్టే, పార్టీ అధినేతకే ఇలా ఉంది అంటే సామాన్య ప్రజల్ని ఈ ప్రభుత్వం ఎంత గౌరవిస్తుందో అర్థం చేసుకోగలరు. ఈ చర్యలను మేము భేషరతుగా ఖండిస్తున్నామని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.