పవన్ సతీమణిపై అసభ్యకర పోస్టులు.. గూడూరు పోలీసులకు జనసేన ఫిర్యాదు

పెడన నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజీనావాపై అసభ్యకర పోస్టులు పెడుతూ.. పవన్ కళ్యాణ్ గారి సతీమణి యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తూ మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపైపెట్టడాన్ని పెడనలోని జనసేన నాయకులు, వీరమహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై, అబద్ధపు ప్రచారాలు చేస్తున్న యూట్యూబ్ ఛానల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కించపరుస్తూ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పెడన నియోజకవర్గం, గూడూరు పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ఆదేశాల మేరకు వీరమహిళలు, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.