అనంతపురం జనసేన మహిళా కార్యాలయం నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భవ్య భారత నిర్మాణానికి యువత నడుం బిగించాలని జనసేన పార్టీ మహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జనసేనపార్టీ మహిళా కార్యాలయం నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు జెండా వందనం చేసి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా శ్రీమతి పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగలు, పోరాటల ఫలితమే నేటి ఈ స్వాతంత్ర్య భారతమని అన్నారు. యోధులు కళలుగన్న భవ్య భారతదేశ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి బంగారు బాటలు వేసి వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పెండ్యాల హరి, రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పసుపులేటి పద్మావతి, జిల్లా కార్యదర్శి శ్రీ కాశెట్టి సంజీవరాయుడు, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, నగర కార్యదర్శులు శ్రీమతి జక్కిరెడ్డి పద్మావతి, శ్రీ కొత్తచెరువు నాగ విశ్వనాథ్, శ్రీ సంపత్, శ్రీ కుంకాల లాల్ స్వామి, నగర సంయుక్త కార్యదర్శి శ్రీ ఆకుల అశోక్, వీర మహిళలు శ్రీమతి కాశెట్టి సావిత్రి, శ్రీమతి గుమ్మడి సాని శిల్పా, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి దార్భి, శ్రీమతి వాణి, శ్రీమతి రమాదేవి నాయకులు శ్రీ కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీ తోట ప్రకాష్, శ్రీ సాయికుమార్, శ్రీ రామయ్య, శ్రీ యంభా విశ్వనాథ్, శ్రీ జక్కిరెడ్డి రామ్మోహన్, శ్రీ మహేంద్ర, శ్రీ అభి, శ్రీ లోకేష్, వీర మహిళలు శ్రీమతి కాశెట్టి సావిత్రి, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి దార్భి, శ్రీమతి వాణి, శ్రీమతి రమాదేవి జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *