ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందిస్తా: బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం గ్రామంలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు గ్రామ ప్రజలకు ఎవరికీ తెలియకుండా గ్రామ సభలు నిర్వహించడం దారుణమని కుర్రే నాగబాబు గ్రామ సభను అడ్డుకోవడం జరిగింది. అధికార పార్టీ నాయకులు నాగబాబుని అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సుమారు 200 మంది జనసైనికులతో కలిసి నాగబాబుకి సంఘీభావం తెలిపి మీకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ జనసేన పార్టీ తోడుగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. రాజానగరం నియోజకవర్గ ప్రజల తరుపున పోరాడే నాయకులకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందిస్తామని ఈ సందర్బంగా తెలియచేసారు. వీరి వెంట అఖిలపక్షం అధ్యక్షుడు అడపా శ్రీనివాస్, కిమిడి శ్రీరామ్, గళ్ళ రంగా ,బాబులు, శ్రీనివాస్, దొరబాబు, రాజు మరియు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.