పెనుకొండ జనసేన కార్యాలయం నందు ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

భవ్య భారత నిర్మాణానికి యువత నడుం బిగించాలని జనసేన పార్టీ పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు మండల కన్వీనర్ మహేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు జెండా వందనం చేసి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ పెనుకొండ మండల కన్వీనర్ మహేష్, సోమందేపల్లి మండల కన్వీనర్ జెబి అన్న, వీర మహిళ శిరీష, పెనుకొండ మండలంనాయకులు, నాగరాజ్, బంగారం, సయ్యద్ బాబా, ప్రసాద్ ,బద్రి, చంద్ర, రామంజి ,రమేష్, రొద్దం మండల నాయకులు చలపతి, తిరుపతి, పెనుగొండ పట్టణ నాయకులు,విజయ్ సంతోష్, చంద్రశేఖర్, శ్రీకాంత్, షేక్షావలి, మారుతి, సురేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *