సత్తెనపల్లి జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనకు ఈనాటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అని ఆ మహనీయుల త్యాగాలను సదా స్మరిస్తూ ఉండాలి అని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసరావు, పట్టణ నాయకులు రాడ్లు శ్రీనివాసరావు, రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు అంచుల అనేష కుమార్, కుడితిరి సిసింద్రీ, ఐలం ఆదినారాయణ,అండెం పుల్లారావు, గలబా మురళీ, పగడాల కిషోర్, రవికిరణ్, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.