కోటనందూరు జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

తుని నియోజకవర్గం: తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజాశేషు ఆధ్వర్యంలో కోటనందూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, ఆర్మీ జవాన్ చుక్కల విజయ్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి, జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ నక్కా రామకృష్ణ, పెనుముచ్చు ప్రవీణ్, కోట సందీప్, కూనిశెట్టి నాగేశ్వరరావు, పెంటా కుమార్, గంటా దుర్గ ప్రసాద్, అల్లు రాజు బాబు, అల్లవరపు సురేష్, కీర్తి స్వామి, జనసేన పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.