పెద్దాపురంలో జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  • జెండా ఆవిష్కరణలో పాల్గొన్న ఇంచార్జ్ తుమ్మల బాబు

కాకినాడ జిల్లా, పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. ముందుగా సామర్లకోట పట్టణంలో 27వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి అత్తిలి కృష్ణ వార్డులో జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తుమ్మల రామస్వామి(బాబు) జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం పెద్దాపురం శ్రీ సత్య సాయి బాబా సంఘం ఆహ్వానం మేరకు సత్యసాయిబాబా ని దర్శించుకుని ఆలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర (కేక్ హౌస్) నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ హాజరై.. కేక్ కటింగ్ చేసి అనంతరం స్వతంత్ర సమరయోధులు స్మరించుకుంటూ ఎందరో స్వతంత్రంలో పాల్గొన్న వీరులు ప్రాణాలు త్యాగఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్న 75 ఏళ్లు పూర్తి చేసుకున్న స్వాతంత్ర్య భారతదేశమని, దాన్ని మనం పూర్తిస్థాయిలో కాపాడుకుని మన భవిష్యత్తులో వచ్చే పిల్లలకు కూడా స్వాతంత్య్రం గురించి త్యాగమూర్తులు గురించి వివరించవలసినటువంటి అవసరం ఉందని.. పిల్లలకు కూడా దేశం మీద భక్తి వచ్చేలాగా పెంపొందించాలని జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల బాబు హితువు పలికారు ఈ కార్యక్రమంలో పెద్దాపూరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, పెద్దాపురం నియోజకవర్గం రూరల్ గ్రామాల నాయకులు జనసేన కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *