పిడుగురాళ్ల జనసేన ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

పిడుగురాళ్ల, జనసేన పార్టీ పిడుగురాళ్ల ఆధ్వర్యంలో సోమవారం పిడుగురాళ్ల పట్నంలోని కిరణ్ ఆటో మొబైల్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి, భారత్ మాత విగ్రహానికి పూల దండలు వేసి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పించి, తదనంతరం పులిహార పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగమే ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామని, వారి యొక్క ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్కరు నింపుకొని దేశం కోసం సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలని, అదేవిధంగా దేశం పట్ల సమాజం పట్ల దేశభక్తి గల పవన్ కళ్యాణ్ లాంటి నాయకున్ని ఎన్నుకోవాలని అప్పుడే బడుగు బలహీన వర్గాలలు, బిసి మైనార్టీలు అందరికీ నిజమైన స్వతంత్ర ఫలాలు అందుతాయని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాసిం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, జనసేన నాయకులు పెదకొలిమి కిరణ్ కుమార్, బయ్యవరపు రమేష్, చిదేళ్ల రామకృష్ణ, మట్టం పరమేష్,బేతంచెర్ల ప్రసాద్, దాస్, ఏ.వి రమేష్ శివ సుబ్రహ్మణ్యం, వీరమహిళలు వెంకటరమణ, అరుణ, నాగరాజు, గద్దెనబోయిన సతీష్, వెంకట శివ కృష్ణ, కృష్ణ చైతన్య, వెంకటేశ్వర్లు, ఉదయ్, బేతంచెర్ల శ్రీను, గౌస్ మేస్త్రీ, అనంత్, అశోక్, హోసన్నా, సైదా, అబ్దుల్ గఫూర్, రామస్వామి, నరేష్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.