రణస్థలం గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రణస్థలం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ 3వ వార్షకోత్సవం మరియు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుడు రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి చేసిన మేలును గుర్తు చేసుకోవడం జరిగింది. సాయంత్రం ఆర్.ఎన్.ఎం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమం స్థానికుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుపుకోవటం జరిగింది.