వృద్ధులకు అండగా డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామం నందు ఏ ఆధారం లేక మంచాలకే పరిమితమైన చెల్లూరి వీరభద్రరావు, సత్యవతి అను వృద్ధులను వారు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసిన స్థానిక జనసైనికులు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కు చెప్పడం జరిగింది. విషయం తెలుసుకున్న డాక్టర్ శ్రీధర్ వృద్ధులను పరామర్శించి వారి కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార నాయకులు పల్లేటి బాపనదొర, వీరమరెడ్డి అమర్, వేల్పుల చక్రధర్, పల్నాటి మధు, బుద్దాల సత్తిబాబు, పి కుమార్, దుడ్డు రాంబాబు, కోటిపల్లి గోపి, బావిశెట్టి నందిబాబు, కోటిపల్లి కాశి, బసవ గోపి, నాగం మధు, నాగళ్ళ జాన్, పెంట వెంకటేష్, నంది మణికంఠ, సిగటపు నారాయణరావు మరియు జనసైనికులు పాల్గొనడం.