చిర్రి బాలరాజు అద్వర్యంలో టిడ్కో ఇళ్ల పరిశీలన
పోలవరం నియోజకవర్గం, కొయ్యలగుడెం మండలం, సరిపల్లి గ్రామ పంచాయితీ జగనన్న కాలనీని పవన్కళ్యాన్గారి పిలుపు మేరకు ఇంచార్జ్ చిర్రి బాలరాజు అద్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు పరిశీలించడం జరిగింది. ఇక్కడ దాదాపు 50 ఇళ్ళకు పైగా కడతామని ప్రారంభాలు చేసి కేవలం రెండు, మూడు భేస్మెంట్లు మాత్రమే నిర్మించి పక్కన పడేసారు ఇక్కడం కొండ ఒకపక్క క్వారీ 50 అడుగులోతు నిండా నీరు కాలనీ ప్రదేశమే భయానకం ఇక్కడ స్థానిక లబ్ధిదారులు కూడా మాతో వచ్చి మొర పెట్టుకున్నారు మీరు ఇళ్ళు కట్టుకోకపోతే స్థలం వెన్నక్కి తీసేసుకుంటాం అంటున్నారట మొదట వాళ్ళే కడతామని మళ్ళీ ఇలా అంటే మేము పేదలం ఎలా కట్టుకోగలం తీసేసుకుంటే తీసేసుకోండి అంటాం అని బోరుమంటున్నారు. అధినేత అంతరంగం జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్ళు ఇక్కడ స్ఫష్టంగా కనబడ్డాయ్. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు తోట రవి, స్థానిక పంచాయితీ సర్పంచ్ తాడేపల్లి గోపి, సీనియర్ నాయకులు చోడిపిండి సుభ్రమణ్యం, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, అప్పన ప్రసాద్, మాదేపల్లి శ్రీనివాస్, కసుకుర్తి ఉమ, పసుపులేటి రాము, కొయ్యలగుడెం మండల కమిటీ సభ్యులు, సరిపల్లి, గ్రామ కమిటీ సభ్యులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.