కుప్పం జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

కుప్పం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిట్కో ఇళ్ల సోషల్ ఆడిటింగ్ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తలు కలసి ఆదివారం శాంతిపురం మండలం, సి బండిపల్లి పరిధి కాలనీలో చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ పేదలందరికి ఇల్లు అన్నారు.. వారికి సరైన మౌలిక వసతులు లేకుండా మరియు చెట్లు, గుట్టలున్న ప్రాంతంలో ఇండ్లు ఇవ్వడం బాధాకరం, అలాగే సంవత్సరం గడుస్తున్నా కనీసం పునాది పనులు కూడా ప్రారంభించలేంటే మీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు కనుబడుతుంది. ఇకనైనా మీ ప్రకటనలు పేపరులకే పరిమితం కాకుండా మీ వాగ్దానాలు పూర్తి చేసుకోవాలని జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి సంయుక్త కార్యదర్శులు వేణు రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి వామనమూర్తి చిరంజీవి యువత అధ్యక్షులు నవీన్ సమన్వయకర్తలు అరుణ్ మండల కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ హరి సురేష్ రవితేజ మరియు రాజేంద్ర పాల్గొనడం జరిగింది.