మేడ గురుదత్ ప్రసాద్ ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, చిన్న కొండేపూడి, చీపురపల్లి, వంగళపూడి, సీతానగరం, సింగవరం గ్రామాల్లో ఇచ్చిన జగనన్న కాలనీలను సందర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత శ్రీ మేడ గురుదత్ ప్రసాద్, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరిచిర్ల విజయ శంకర్ . జగనన్న ఇళ్లు – పేదల కన్నీళ్లు కార్యక్రమం లో బాగంగా 2వ రోజు జగనన్న ఇళ్ళ కేటాయింపు పూర్తిగా నివాసయోగ్యం కానీ ప్రాంతాలలో జరిగింది. ప్రభుత్వం నిర్మాణాలు చేపట్ట లేదు కావున అక్కడ స్థలాలు అన్ని నిరుపయోగంగా ఉండటమే కాకుండా ఊరుకి 4కిలోమీటర్ల దూరం లో ఉండడం ఎలాంటి సౌకర్యాలు లేవు అని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఈ కార్యక్రమం లో సీతానగరం మండల కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, మండల కమిటీ ప్రధాన కార్యదర్శి దుబాయ్ శ్రీను, చిడిపి నాగేష్, రాజు, అప్పయమ్మ (ప్రసాద్ ), సీతానగరం మండల వీరామహిళ కందికట్ల అరుణ కుమారి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు నాగు, చదువు ముక్తేశ్వరరావు,గణశాల ఏసుబాబు, కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, తెలగంశెట్టి శివ, రాయపాటి హరీష్, రాయపాటి సూరిబాబు, రాజానగరం మండలం నాయకులు మెడిద వీరబాబు, నందికం శేషాగిరి గ్రామస్తులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.