జనసేనాని స్పూర్తితో డా. వడ్లపట్ల సాయి శరత్ లక్ష విరాళం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు సంఘీభావంగా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ తన వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు చెక్కును పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు సమక్షంలో స్టేట్ పిఎసిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి అందజేయడం జరిగినది.