జనసేన ఆధ్వర్యంలో మంచి నీటి పంపు ఏర్పాటు

అవనిగడ్డ నియోజకవర్గం: మోపిదేవి మండల, మోపిదేవి – రావివారిపాలెం వెళ్లే రోడ్డు లో ఉన్న జగనన్న ఎస్టీ లేఔట్ లో ప్రభుత్వం గానీ, అధికార పార్టీ గాని ఏర్పాటు చేయలేని కనీసం మౌలిక సదుపాయాలైన మంచి నీరుని జనసేన పార్టీ మోపిదేవి మండల జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ అధ్యక్షతన చేతి పంపు వేయించడం జరిగింది. ఈ మంచి నీటి చేతి పంపును మోపిదేవి మండల పార్టీ సీనియర్ నాయకులు కామిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్, పర్చూరి కేశవ, కలపాల ప్రసాద్, మత్తి సాంబశివరావు, మత్తి శివనంది, కేతరాజు రామకృష్ణ, యర్రంశెట్టి సునీల్, తుటారం వీరరాఘవయ్య, రేపల్లె నాగేంద్ర బాబు, రాఘవ కూరేటి పాల్గొన్నారు.