ఒలింపిక్ విజేతలను అవమానించడం అమానుషం.. జానీ

పాలకొండ నియోజకవర్గం: జనసేన జానీ(ఆర్కే) మాట్లాడుతూ.. ఒలింపిక్ పతాక విజేతలను అతి దారుణంగా ఈడ్చుకెళ్లే విధానం చాలా బాధాకరం అని జనసేన జానీ ఆవేదన వ్యక్తం చేశారు. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన రెజ్లర్లను పోలీసులు ఆలా ఈడ్చి పడేయడంపై ఒక సామాన్య దేశ పౌరుడిగా స్పందిస్తున్నాను. క్రీడాకారులపైన ఇంత గోరంగా ప్రవర్తించడం తప్పుడు పద్ధతిని నేను నా జీవితంలో ఇంతకముందు చూడలేదు. జీవితంలో ఇలాంటి సంఘటనలు మహిళలు పై జరగకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకాలను ఎగరవేసిన ఛాంపియన్ లను నడిరోడ్డుపై అలా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూసి నా మనసు తట్టుకోలేక స్పందించుతున్నాను అని జనసేన జానీ(ఆర్కే) తన ఆవేదనను వ్యక్తం చేసారు.