ఏసుబాబు కుటుంబానికి జనసేన అండ

యూ కొత్తపల్లి మండలం, కోనపాపపేట గ్రామానికి చెందిన జనసైనికుడు మరియు మత్స్యకార సోదరుడు యజ్జల ఏసుబాబు అకాల మరణం చెందడంతో.. వారి కుటుంబాన్ని పరామర్శించి.. వారికి ఏ ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని హామీ ఇస్తూ తమకు తోచినంతలో వారికి 2 బస్తాల బియ్యంతో ఒక నెలకు నిత్యవసరాలను ఇస్తూ 2వేల రూపాయలను ఆర్థిక సహాయంగా మత్స్యకార నాయకులు రాష్ట్ర కార్యదర్శి కంబాల దాసు నియోజకవర్గ జనసేన నాయకులు వెన్నా జగదీష్, మరియు కొత్తపల్లి మండల జనసేన నాయకులు పల్లేటి బాపన్న దొర అందజేసారు.

ఈ సమయంలో జనసేన కుటుంబాన్ని పరామర్శించేందుకు నాయకులు యర్రంశెట్టి బాబ్జీ, బత్తిన శివ, తిరంసెట్టి ఇస్సాక్, పిల్లి అన్నవరం పెనుపోతుల చక్రి, తాటికాయల చంద్ర రావు, బి స్వామి, పి కుమార్, సి.హెచ్ గంగ, వై కొండబాబు, పి. అప్పారావు, మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.