పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించడం తగదు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేటలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ బుధవారం ఈ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి బటన్ నొక్కే ప్రోగ్రాం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం తగదని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల గురించి ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే ఈ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఈ వైసీపీ నాయకులకి రాజంపేట జనసేన పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్యాకేజీ ప్యాకేజీ అని అంటున్నారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నట్లు మీరు దమ్ముంటే నిరూపించగలరా అని జనసేన నాయకులు పేర్కొన్నారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల గురించి మాట్లాడడం ఈ వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని జనసేన నాయకులు అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి తెలుగు మాట్లాడడం సరిగా రాదు వారాహి ని వరాహి అంటాడు. ముందు తెలుగు మాట్లాడేది బాగా నేర్చుకోండి అని రాజంపేట జనసేన నాయకులు హెచ్చరించారు.