కరణం కిరణ్ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన ఆమదాలవలస జనసేన

ఆమదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన జనసేన యువకుడు కరణం కిరణ్ కుటుంబానికి జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, స్దానిక జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ ఆధ్వర్యంలో మరియు కొల్ల జయరామ్, తులగాపు మౌళి, కిల్లన నరేష్, టంకాల శ్రీనివాస్ సమక్షంలో కుటుంబానికి రూపాయలు 35000/- జనసేనపార్టీ తరుపున అందించడంజరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, గ్రామ ప్రజలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.