చేనేత కార్మికులకు చేయూత కల్పిస్తానన్న సూర్యచంద్ర

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 721వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ జనసేన పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న ఇంచార్జ్ సూర్యచంద్ర. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేనేత కార్మికులకు, వారి స్వహస్తాలతో నేసే చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో ఉన్న చేనేత కార్మికులు అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ గెలిచిన తర్వాత చేనేత కార్మికులు మగ్గాలు కొనుక్కోవడానికి ప్రభుత్వం నుండి సబ్సిడీ ద్వారా లోన్లు ఇప్పించడమే కాకుండా. వారే సొంతంగా ముడి సరుకు కొనుగోలు చేసి చీరలు, వస్త్రాలు తయారుచేసేవిధంగా వారికి ప్రోత్సాహం అందించి, చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుని చేనేత కార్మికులే వ్యాపారవేత్తలుగా ఎదిగే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు.