బొడపాటి రాజుకి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

గోపాలపురం నియోజకవర్గంలోని, గుడ్డిగూడెం గ్రామంలో గత సంక్రాంతి పండుగ రోజున జనసేన పార్టీకి సంభందించిన ఫ్లెక్సిని పెట్టడానికి గునపంతో గొయ్య తీస్తున్న సమయంలో బొడపాటి రాజుకి కాలు పై భాగం నుంచి కింది భాగం వరకు గునపం దిగి ఇబ్బందిపడుతున్న కారణంగా వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ దొడ్డిగర్ల సువర్ణరాజు చేతులు మీదుగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరపున ఆయనకి 5000/- విలువ గల కిరాణా సరుకులు, బియ్యం, నూనె మరియు 5000/-రూ నగదు అందజేశారు. గ్రామ అధ్యక్షులు నరేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పోసిన గణపతి, హుకుంపేట గ్రామ అధ్యక్షులు గెర ఫణీంద్ర, చిట్యాల పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ బాబు, వీర కృష్ణ గారు మరియు పార్టీ నాయకులు సి రాజేష్, సీతారాం, మణికంఠ, సర్వరాయుడు, శ్రీను, పోసేశ్వరరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంచార్జీ సువర్ణరాజు మాట్లాడుతూ కష్టాల్లో వున్నవారిని ఆదుకోవడం జనసేన పార్టీ యొక్క ప్రధాన సిద్దాంతం అని జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్నవారికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా కౌలు రైతులు విషయంలోనూ ప్రకృతి వైపరీత్యాలు సంభావించినటువంటు సమయంలో ఎంతో మందిని ఆదుకోవడం మనం చూసియున్నాము. అలాగే ప్రతి ఒక్క జనసైనికుడు జనసేన పార్టీ సిద్ధంతాలను మరియు లక్ష్యాలను ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.