జనసైనికుడు లక్ష్మణ్ కు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, పెద్దకోవ్వాడ మత్స్యకార కుటుంబానికి చెందిన జనసైనికుడు లక్ష్మణ్ పిన్ని సూరడా కోర్లమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ఎచ్చెర్ల నియోజకవర్గ యువ నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ ఆదివారం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. మీ కుంటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజారమేష్, సూర్య, అవినేష్, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.