చల్లమ్మకు మనోధైర్యాన్నిచ్చిన శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల, నెల్లిమర్ల టౌన్ లోని 11 వ వార్డులో చల్లమ్మ అనే వృద్ధురాలు తన రెక్కల కష్టంతో జీవనోపాధి కొనసాగిస్తూ చిన్న పూరి గుడిసెలో తాను ఒక్కటై జీవితం గడుపుతూ ఉండగా ఆ ప్రాంత వాసులు తన కష్టాలను చూసి నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి లోకం మాధవికి తెలియజేయగా, విషయం తెలుసుకున్న మాధవి ఆ వృద్ధురాలికి రూపాయలు 12,000/- ఆర్థిక సహాయం అందజేసి, తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆ మహిళకి ఆత్మస్థైర్యాన్ని నింపి, జనసేన-తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాగానే తనకి పక్కా ఇల్లు మంజూరు అయ్యేలా తాను చొరవ తీసుకుంటానని శ్రీమతి లోకం మాధవి ఆ వృద్ధురాలికి తెలియజేశారు. ఈ సందర్భంగా చల్లమ్మ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా తమని పట్టించుకునే నాధుడే లేడని ఏ ఒక్క ప్రభుత్వం తమ వైపు చూడలేదని మాధవి నా గురించి తెలుసుకొని ఆర్థిక సాయం అందించి నాకు అండగా నిలిచినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు.