పలు కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, కాకినాడ రూరల్ మండలం జనసేన నాయకులు తిమ్మాపురం వాస్తవ్యులు మాదారపు తాతాజీ తండ్రి ఇటీవల స్వర్గస్తులవడంతో శైన్వారం తాతాజీ ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పరామర్శించడం జరిగింది. అనంతరం కాకినాడ రూరల్ మండల జనసేన పార్టీ మండల కమిటీ కార్యదర్శి బండారు లక్ష్మణ్ ఇటీవల అకాలమరణం చెందడంతో చీడిగ గ్రామం వారి స్వగృహంలో పెదకర్మ రోజు సందర్బంగా బండారు లక్ష్మణ్ చిత్రపటానికి పువ్వులు వేసి, నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.