విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పితాని
ముమ్మిడివరం, ది.04.11.2023 శనివారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు కాశివారితూము సెంటర్ నందు హైవే దగ్గర జనసేన-తెలుగుదేశం పార్టీల ఆత్మీయ కలయిక నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరుపుటకు నిర్ణయించడం జరిగిందని, కావున జనసేన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు నియోజకవర్గం నాయకులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-02-at-13.29.54-906x1024.jpeg)