జనసేనాని పై రెక్కీని ఖండించిన రాజాం జనసేన

రాజాం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద రెండు రోజుల క్రితం రెక్కీ నిర్వహించి, అతనకు ప్రాణహాని తలపెట్టడానికి కొందరు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు జనసైనికులు తీవ్రంగా ఖండించడం జరిగింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పటిష్టమైనటువంటి పోలీసు భద్రతను కల్పించాలని పి.ఎం.ఓ కి, కేంద్ర హోంశాఖకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర హోంశాఖకు, రాష్ట్ర డిజిపికి లేఖ వ్రాయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సైదాల జన, కె.వి.ప్రవీణ్, అన్నం నాయుడు, హేమంత్, అప్పలనాయుడు, అనుదీప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.