ప్రభుత్వ ఉద్యోగులను కూడా జగన్ రెడ్డి మోసం చేశారు

మదనపల్లె, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి రూ.800 కోట్లు మాయం అయిపోయాయి. జగన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన అనేక వర్గాలలో ప్రభుత్వ ఉద్యోగుల్లు కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని వర్గాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను కూడా జగన్ రెడ్డి మోసం చేశారు. వారంలో సిపిఎస్ రద్దు అని ఇప్పుడు అసాధ్యం అంటున్నారు. ఇప్పుడు ఏకంగా డీఏ ఎరియర్స్ సొమ్ము ఉద్ద్యోగుల ఖాతాల్లో పడినట్లే పడి మాయం అయిపోయాయి. ఇలా జరగడం మొదటిసారి కాదు, ఇది రెండవసారి. ఇలా ప్రభుత్వ ఉద్ద్యోగుల ఖాతాల్లో నుండి డబ్బు వెనక్కి తీసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు అర్దం. కానీ ఆర్ధిక మంత్రి మాత్రం ఏ ఇబ్బందులూ లేవని అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలారా! జగన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల మాటున ఆర్ధిక క్రమశిక్షణను అస్సలు పాటించడం లేదు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇవన్నీ గమనించి రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం జనసేనకు ఇవ్వాలని కోరుకుంటున్నానని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.