మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి లేదు

  • మద్యాన్ని నిసేదిస్తానని అపద్దపు మాటలు చెప్పి మద్యాన్ని ఏరులై పారిస్తు మహిళల పుస్తెలు తెంచుతున్న నీచుడు జగన్ నువ్వా మహిళా సాధికారత గురించి మాట్లాడేది
  • జగన్ రెడ్డి ఉరవకొండ సభలో పచ్చి అపద్దాలు అబుత కల్పనలే
  • జగన్ రెడ్డి స్టార్ క్యంపైనర్లు కోడి కత్తి,గొడ్డలి పోట్లు
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్ : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమాన్ని మంగళవారం 13వ డివిజన్ లో నిర్వహించి స్థానిక ప్రజలనుంచి వచ్చిన పలు సమస్యల గురించి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జిల్లా పర్యటనకు సంభందించిన అంశాల గురించి మాట్లాడుతూ స్థానిక డివిజన్ లో ఉన్న మద్యం దుకాణాన్ని పరిశీలించి ఈ విధంగా మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డికి మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎందుకంటే ఒకపక్క వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నావడ్డీ, అమ్మవడీ అని మహిళలకు అర కొర కొద్దిమందికి మాత్రమే ఇస్తూ మరొకపక్క గత ఎన్నికల వాగ్దానాలలో భాగంగా నాఅక్కలు నాచెల్లెళ్ళ జీవితాలు బాగుపడాలంటే మద్యాన్ని పూర్తిగా నిసేదిస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటను మరిచి విపరీతంగా నకిలీ మద్యాన్ని అమ్ముతూ.. ఆమద్యం త్రాగిన వారు ఉదరకోస వ్యాధులతో బాధపడుతూ ఏ ప్రభుత్వ వైద్యశాలలో చూసినా నకిలీ మధ్యన బారినపడి అనారోగ్యానికి గురై మరణించే వారే ఉన్నారని మద్యం ఏరులై పారాడం వాళ్ళ ఎందరో మహిళల పుస్తెలు తెగాయని వీరిగోడు జగన్ రెడ్డికి కచ్చితంగా తగులుతుందని మహిళా సాధికారత అంటే ఇదేనా జగన్ రెడ్డి అంటూ మహిళా సాధికారత గురించి ఆలోచించేది పవన్ కళ్యాణ్ చంద్ర బాబు నాయుడే అని ఒక్కసారి జగన్ మాటలునమ్మి మహిళలు మోసపోయారని ఈసారి కచ్చితంగా జనసేన టీడీపీ పార్టీలకే ఓటు వేయాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.