వడ్డెర్లను నమ్మించి నట్టేట ముంచిన జగన్ రెడ్డి

  • వడ్డే ఓబన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
  • ఇసుక కొరత వల్ల ఉపాధి కరువై భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది
  • వడ్డెర్ల సమస్యల సాధనకు జనసేన టీడీపీ పార్టీలు కలిసి కృషి చేస్తాయి మీ ప్రధాన డిమాండ్లను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతాము
  • భారతీయ వడ్డెర్ల ఐక్యత ఎస్టి సాధన సమితి సభ్యులతో జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం: భారతీయ వడ్డెర ఐక్యత ఎస్టీ సాధన సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడ్డే కుళ్ళయప్ప వడ్డెర్ల ప్రధాన సమస్యలను సోమవారం స్థానిక జనసేన పార్టీ మహిళా కార్యాలయానికి విచ్చేసి రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలతకి వివరించి మెమరాండం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్డెర్లు దాదాపు 35 లక్షల మంది ఉన్నారని వారిదామాషా ప్రకారం రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తూ వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి వడ్డెర్లను నమ్మించి మోసం చేశాడని, ఇసుక కొరత తీవ్రంగా ఉండి వడ్డెర్ల ప్రధాన జీవనాధారమైన భవన నిర్మాణం దెబ్బతిని ఆ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో దాపరించాయని కచ్చితంగా మీ సమస్యలను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తరతరాలుగా రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్న వడ్డెర కార్మికులు ఆరోగ్య ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని వడ్డెర్ల కార్పొరేషన్ నిధులు పెంచి ఆ నిధులు సకాలంలో విడుదల చేసి వడ్డెర్లను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వడ్డెర్ల రాష్ట్ర అధ్యక్షులు వడ్డే సురేష్ ఉపాధ్యక్షులు నాగేశ్వర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగుల ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు పీట్ల ఆనంద్, సలహాదారులు మల్లెల కాసిం, సాకే నాగరాజు, సంపత్ కుమార్, మహేష్, రామాంజనేయులు, కుంచపు లక్ష్మన్న, గోగుల వెంకటనారాయణ, కుమార్, ఎర్రి స్వామి, వంశీ రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.