ఎస్ పేట దర్గాలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన జానీ బాయ్

ఆత్మకూరు నియోజకవర్గం: తరుణవాయి గ్రామంలో మరణించిన అంగన్వాడీ కార్యకర్తకు ఆర్థిక సహాయం అందించేందుకు విచ్చేసిన జానీ బాయ్ దగ్గరగా ఉన్న ఏఎస్ దర్గాలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నళిశెట్టి శ్రీధర్ సూచనలతో జనసేన మండల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్గాకు ఎన్నోసార్లు తాను రావడం జరిగింది. సామాన్యుడిగా వచ్చి చాలా సార్లు దర్శించుకున్నాను. ఏఎస్పేట దర్గా తమ పూర్వికుల నుంచి కూడా ఇక్కడ ప్రార్థన చేసే వారని తెలిపారు. ప్రజలందరూ చల్లగా ఉండాలని రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థాయికి ఎదగాలని.. ప్రజా సేవ చేసుకునే అవకాశం తనకు రావాలని తెలిపారు. జన సైనికుల ఆదరాభిమానాలు మర్చిపోలేని ఎక్కడికి వెళ్లినా జనసేన అభిమానులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అరగంటలో ఇక్కడికి వస్తున్నానని తెలియగానే ఇంతమంది జనసేన నాయకులు మద్దతు దారులు పాల్గొనడం సంతోషంగా ఉందని. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అక్బర్, జనసైనికులు మరియు జనసేన మద్దతు దారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.