కాపులపై జగన్ రెడ్డిది కపట ప్రేమ: నిమ్మకాయల రాము

  • మీరు మమ్మల్ని దుష్ట చతుష్టయం అంటే మిమ్మల్ని మాయల మరాఠీ అనాల్సి వస్తుంది.
  • కాపులకు ఈబీసీ రిజర్వేషన్ తొలగించిన ద్రోహి జగన్
  • కాపు కార్పొరేషన్ కు ఏటా ఇస్తామన్న రూ. 2 వేల కోట్లు ఏమైయ్యాయి?
  • కాపు సంక్షేమానికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయండి
  • కాపులు అమ్ముడుపోతారని సీఎం మాట్లాడుతుంటే వేదికపై ఉన్న కాపు నాయకులకు పౌరుషం రాలేదా?

అనంతపురం, కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.2 వేలు కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కాకి లెక్కలను పక్కన పెట్టి, గత మూడేళ్లలో కాపులకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. వివిధ పథకాలకు ఇచ్చిన నిధులన్నీ కాపుల కోటాలో చూపిస్తూ మోసం చేయడం మానుకొని, కాపులకు ఈ ప్రభుత్వం చేసిన అసలైన లబ్ధిని చూపించాలన్నారు. ఈబీసీ కోటాలో కాపులకి ఉన్న రిజర్వేషన్ తొలగించి కాపు జాతికి ద్రోహం చేసింది సీఎం జగన్ రెడ్డి. ముఖ్యమంత్రి కాపులకు లబ్ధి చేశారంటే నమ్మే పరిస్థితి లేదు. కాపు మంత్రులను కేవలం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. వారికి మరే పనీ ఉండదు. అధికారం అసలే ఉండదు. ఈబీసీ రిజర్వేషన్లలోనూ ఈ ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసింది. ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు ప్రత్యేకంగా ఇచ్చిన 5 శాతం కోటాను కూడా తీసేసి.. కాపులకు ఏదో అద్భుతం చేశామని ఈ ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. సీఎం మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. వివిధ పథకాల ద్వారా కాపులకు అందిన ప్రతిఫలాన్ని సైతం కాపుల సంక్షేమం కోటాలో పెట్టడం ఈ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగం. కాపులను ప్రతిసారీ అవమానిస్తూ… కాపు సామాజికవర్గ నేతలతోనే బూతులు తిట్టిస్తున్న ఈ ముఖ్యమంత్రి తీరును కాపు సోదరులు గమనిస్తున్నారు. ఏవేవో లెక్కలు చెప్పి, కాపులకు ఏదేదో చేస్తున్నాం అని మభ్యపెట్టాలని చూస్తున్న ఈ ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాల్సిన అవసరం ఉంది. బటన్ నొక్కితే అద్భుతాలు జరిగిపోతాయని భావిస్తున్న ఈ ముఖ్యమంత్రి కాపు కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిన కాపులే మిమ్మల్ని భూస్థాపితం చేసే రోజు దగ్గర్లోనే ఉందని నిమ్మకాయల రాము.