రాజానగరం జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

  • రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా మా పేటలో ముఖం చూపించలేదు….. దివాన్ చెరువు గ్రామానికి చెందిన బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు….

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు… రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పేద ప్రజలకు ఇస్తానన్న జగనన్న ఇల్లు పై సోషల్ ఆడిట్ “జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు” 3 రొజుల కార్యక్రమంలో భాగంగా రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో…. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు దళితవాడలో పర్యటించారు… ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కి చెందిన మహిళలు అత్యంత దుర్భరమైన జీవితం అనుభవిస్తూ… ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందక…. ఇస్తానన్న ఇళ్ల స్థలాలు రాక…. నెంబర్ వన్ నియోజవర్గంగా డప్పు కొట్టుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఈ ప్రాంతము పర్యటించకపోవడం అత్యంత దారుణంగా బాధపడడం…. వందలాదిమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన మహిళలకి సరైన ఇల్లు లేక ఇళ్ల స్థలాలు రాక కనీస సౌకర్యాలైన నీరు కరెంటు డ్రైనేజీ వ్యవస్థ లేక అత్యంత దుర్భర జీవితం అనుభవిస్తున్నారు… ప్రకటన లు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షలు ఇళ్ళు పేద ప్రజలకు అందిస్తున్నామని అబూత కల్పన కల్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు… ఈ దళిత ప్రజల దుర్భర పరిస్థితిలను బత్తుల దంపతులు మురికివాడలో ఇంటింటికి తిరుగుతూ… ఇక్కడ దయనీయంగా ఉన్న పరిస్థితులు ను మీడియా ద్వారా బయట ప్రపంచానికి చూపించి.. వీళ్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. కార్యక్రమంలో గల్లా రంగా, యర్రంశెట్టి శ్రీను, అక్కిరెడ్డి వేణు, బొంగా స్టాలిన్, బొడ్డపాటి నాగేశ్వరరావు, రాయి చిట్టి బాబు, సంగుల రమేష్, కానవారం నాయకులు సతీష్, రామకృష్ణ, అరిగెల రామకృష్ణ, పాలచర్ల రాజారావు, చాట్ల వెంకటేష్, చాపల లక్ష్మి, రాజనగరం మండలం నాయకులు, జనసైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.