జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన

కనిగిరి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం #jaganannaMosam అనే హాష్ ట్యాగ్ తో కనిగిరి పట్టణ పరిధిలోని చాకిరాల వద్దనున్న టిడ్కో ఇళ్లను మరియు కనిగిరి పట్టణంలోని మోడల్ స్కూల్ వెనుక ప్రాంతంలో ప్రభుత్వ ఇచ్చిన స్థలాలలో ప్రకాశం జిల్లా కార్యదర్శి, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త రహిముల్లా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రహీముల్లా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్ళను ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఇవ్వకుండా ఆలస్యం చేయటం వలన ఇళ్లకు సంబంధించిన ఐరన్ మరియు ఫర్నిచర్ వంటివి తుప్పు పట్టడం చూసి నిరసన వ్యక్తం చేశారు, వెంటనే ప్రభుత్వం టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు… అలాగే ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో మాట్లాడుతూ లబ్ధిదారునికి ఇచ్చిన 1,80,000 వేలోతో ఇల్లు ఎట్లా కట్టుకుంటారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే అక్కడ ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను కనుక్కున్నారు లబ్ధిదారులు మాట్లాడుతూ మాకు చాలా దూర ప్రాంతాల్లో స్థలం ఇచ్చారని చెప్పారు రావడానికి వెళ్లడానికి చాలా కష్టంగా ఉందని చెప్పారు మేము ఇక్కడికి రావడానికి ప్రధానమైన రహదారి చిన్న వాన పడ్డ గుంతలమయం, బురద అసలు వెళ్ళటానికి వీలులేదు అని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోస్ట్ సునీల్, నారాయణ, రాజేష్, చంటి, సాయి కిషోర్, హేమంత్, బాజీ పాల్గొన్నారు.