జగనన్న నవరత్నాలలో రోజుకో రత్నం రాలిపోతోంది

  • 12 నుండి జగనన్న ఇళ్ళు – పేదలకు కన్నీళ్లు పై ప్రజల్లోకి జనసేన

తిరుపతి, వైకాపా ప్రభుత్వం పాలన లోకి వచ్చేందుకు నవరత్నాలను నెరవేరుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, అందులోని (జగనన్న ఇళ్ళు) తో ప్రతిఒక్క పేదవాడి కలను నెరవేరుస్తామని మాట చెప్పి నేడు అదొక స్కాంగా భూకంభకోణం కొనసాగిస్తున్నారని, దీనిపై నవంబర్ 12, 13, 14 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి భూకుంభకోణం, మోసాలపై అన్ని సోషల్ మీడియాలలో ప్లే కార్డులతో ప్రసారం జరిగేలా ఫ్యాన్ పార్టీ పాలనలోని బండారాన్ని బయటపెడతామని, జనసేన పార్టీ నేతలు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, ఆకేపాటి సుభాషిని, కీర్తన, లక్ష్మీ, ఆనంద్, డా.బాబు, కృష్ణయ్య, పార్థు తదితరులు వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియాతో వీరు మాట్లాడుతూ జగనన్న ఇల్లు నక్సలైట్లు , దారిదోపిడిదారులకు నివాసాలుగా తయారయ్యాయన్నారు, వైకాపా ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారుడి ఖాతాలో రెండు లక్షల లోపు ధనాన్ని వేస్తామని వాలంటీర్ల ద్వారా బ్యాంకులలో ఖాతాలను ఓపెన్ చేశారని , కానీ అందులో అమౌంట్ పడలేదని ఇది వైకాపా ఖాతాకు చేరుతున్నదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. జగనన్న మోసాన్ని ఎండగట్టె కోణంలో మూడు రోజుల పాటు జనసేన పార్టీ ప్రజల్లోకెళుతున్నదని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఈ భూ కుంభకోణంపై స్పందించి జనసేన వెంట నడవాలని వారు కోరారు.