కోడి పందాల ముసుగులో జరుగుతున్న పేకాటని అరికట్టాలి: జగ్గయ్యపేట జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-08-at-4.56.52-PM-1024x768.jpeg)
జగ్గయ్యపేట, తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాల ముసుగులో జరుగుతున్న పేకాట శిబిరాలను అరికట్టాలని జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ముత్యాల వెంకట శ్రీనివాసరావు మరియు కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి పెద్డ పండగ సంక్రాంతి సంప్రదాయ ఆట కోడి పందాలను వ్యతిరేకించడం లేదని కానీ ఈ కోడిపందాల ముసుగులో అధికార పార్టీ వారి అండతో పేకాట శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని మరి వీటి వలన అనేక మంది అప్పుల పాలు అవకపోటమే కాకుండా ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని తక్షణమే ఈ పేకాట శిబిరాల్ని అరికట్టవలసిందిగా జగ్గయ్యపేట పట్టణ మరియు రురల్ పోలీస్ వారిని జనసేన పార్టీ తరువున కోరుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్, నాగేశ్వరరావు, రాం, గోపి తదితరులు పాల్గొన్నారు.